తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు లోకేశ్ కు అభినందనలు : కంభంపాటి రామ్మోహన్

  • ఏపీ ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ ఏడాది పూర్తి చేసుకున్నారు
  • లోకేశ్ పని తీరు అద్భుతంగా ఉంది
  • జగన్ మాత్రం నాటకాలరాయుడిగా పేరు తెచ్చుకున్నారు
  • జగన్ కు దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ముందు దీక్ష చేయాలి
ఏపీ ఐటీ శాఖా మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న నారా లోకేశ్ కు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, టీడీపీ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ మాట్లాడుతూ, తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా లోకేశ్ నిరూపించుకున్నారని అన్నారు. లోకేశ్ పని తీరు అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు.

ఈ సందర్భంగా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. జగన్ పాదయాత్ర, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఎంపీలతో రాజీనామా చేయిస్తాననడం, ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం అంతా నాటకాలేనని, ఓ నాటకాలరాయుడిగా ఆయన మారారని మండిపడ్డారు. ఢిల్లీలో చేయాల్సిన ఉద్యమాలు గల్లీలో చేస్తున్నారని, జగన్ కు దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ముందు దీక్ష చేయాలని డిమాండ్ చేశారు.  
Go Back to Shorts
Telugudesam
Nara Lokesh
Kambhampati Rammohan Rao

More Telugu News